ఇవాళ బెంగళూరు రేపు ఎక్కడైనా… నీటి సమస్యపై చిరంజీవి పోస్ట్‌

-

కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటి సమస్య తలెత్తిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగని జల సంక్షోభాన్ని అక్కడి వాసులు ఎదుర్కొంటున్నారు. నీటి ఎద్దడితో చాలా మంది ఆఫీసులకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే నీటి విలువను గుర్తుచేస్తూ ప్రముఖ హీరో చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు.

నీటి సంరక్షణను దృష్టిలో పెట్టుకుని ఇంకుడు గుంతలు, చిన్నపాటి బావులు ఉండేలా ఇంటిని నిర్మించుకోవాలి. బెంగళూరులోని తన ఫామ్‌హౌస్‌లోనూ అటువంటి నిర్మాణాలు చేపట్టాం. ‘‘నీరు జీవనాధారం. నీటి కొరత వల్ల రోజువారీ జీవితం కష్టతరమవుతుంది. ప్రస్తుతం ఆ పరిస్థితి బెంగళూరులో నెలకొంది. రేపు ఇంకెక్కడైనా రావొచ్చు. అందుకే నీటి సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఇంటిని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. నా ఫామ్‌హౌజ్‌లో పెర్మాకల్చర్‌ విధానాన్ని అమలు చేస్తున్నాం’’ అని చిరంజీవి పేర్కొన్నారు. దానికి సంబంధించి ఫొటోలు కూడా షేర్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news