ద్రౌప‌ది పాత్ర‌లో దీపికా

-

మధు మంతెన నిర్మాణ భాగస్వామ్యంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మహాభారతం సినిమాలో ద్రౌపది పాత్రలో హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తుంది. ఈ పాత్రను తానూ అంగీకరించడంతో పాటు ఈ ప్రతిష్టాత్మక సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరించనున్నట్లు వెల్లడించింది దీపికా. ద్రౌపది దృక్కోణంలో మహాభారతాన్ని ఈ సినిమా ఆవిష్కరించడం ఆకట్టుకునే విషయమని ఆమె అన్నారు.

మహాభారతం కథలుకథలుగా మనం తరతరాలుగా చెప్పుకున్నా అవన్నీ పురుషుడి ఆధారంగా అల్లుకున్న కథలు కాగా తొలిసారిగా మహిళా కోణంలో ఈ కావ్యాన్ని ఆవిష్కరిస్తున్నామని అన్నారు, ద్రౌపది పాత్రలో నటించడం తానూ గర్వంగా భావిస్తున్నామని, థ్రిల్ కు గురవుతున్నామని అన్నారు. ప్రతిష్టాత్మక చారిత్రక దృశ్య కావ్యాన్ని తెరక్కేక్కిస్తున్నా ఫిల్మ్ మేకర్ మధు మంతెన స్పందిస్తూ….

ద్రౌపది పాయింట్ అఫ్ వ్యూ లో ఈ సినిమా రూపొందించడం విలక్షణమని అన్నారు. విలక్షణమని చెప్పారు. దీపికా చిత్ర బృందంలో చేరడంతోనే ఈ మూవీని భారీస్ధాయిలో రూపొందుతోందని..ఆమె భారత్‌లో అతిపెద్ద నటి మాత్రమే కాకుండా సినిమాకు హద్దులు చెరిపివేసే సామర్థ్యం దీపికాకు ఉందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news