ఏందయ్యా దిల్ రాజు.. ఏంది నీ అతి..!

-

బడా నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ నుండి సినిమా అంటే ఒక మార్క్.. ప్రేక్షకులు కూడా దిల్ రాజు మీద అంత హోప్స్ పెంచుకున్నారు. సినిమాకు నిర్మాతే అయినా అన్ని దగ్గర ఉండి చూసుకుంటాడు దిల్ రాజు. అయితే ఈమధ్య అది మరీ ఎక్కువైందని అంటున్నారు. ఈమధ్య దిల్ రాజు ప్రవర్తన చూసి అందరు షాక్ అవుతున్నారు. సినిమాకు డబ్బులు పెట్టేది తానే కాబట్టి తను చెప్పినట్టు వినాల్సిందేనని దర్శకులతో అంటున్నాడట.

రీసెంట్ గా రాజ్ తరుణ్ లవర్ సినిమా ప్రమోషన్స్ లో అసలు రాజ్ తరుణ్ మార్కెట్ ఎంత అంటూ అలా తీసి పారేశాడు. ఇక లేటెస్ట్ గా నితిన్, రాశి ఖన్నా జంటగా నటించిన శ్రీనివాస కళ్యాణం సినిమా ఆడియోలో కూడా నితిన్ ఇంటికొచ్చి బ్రతిమాలాడు అంటూ చెప్పాడు. అంతేకాదు ఈ సినిమా మెయిన్ పాయింట్ తాను సతీష్ వేగేశ్నకు చెబితే దాన్ని డెవలప్ చేశాడని అన్నాడు.

శ్రీనివాస కళ్యాణంలో దిల్ రాజు వేలు పెట్టుడు ఎక్కువైందట. స్టేజ్ మీద గొప్పలు చెబుతున్నట్టు ఉన్నా దిల్ రాజు ఈమధ్య అన్ని తానై నడిపిస్తున్న అని చెప్పడంలో మాత్రం దర్శకులకు కాస్త అసంతృప్తిగానే ఉంది. నిర్మాత కాబట్టి తన విలువ కాపాడుకోవాలి. సురేష్ బాబు, అల్లు అరవింద్ ఉన్నారు అంటే ఏదో రెండు మాటలు మాట్లాడి వెళ్తారు. అంతేకాదు సినిమాకు డబ్బులు పెట్టింది మేమే కదా అని ఎలా పడితే అలా మాట్లాడరు. మరి ఈ విషయాన్ని దిల్ రాజు గమనించి ఇకనుండైనా కాస్త తక్కువ మాట్లాడితే బెటర్.

Read more RELATED
Recommended to you

Latest news