మామను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన నమ్రత..!

-

ఘట్టమనేని కుటుంబంలో వరుస విషాదాలు కుటుంబాన్ని బాధల నుంచి తేరుకోనీకుండా చేస్తున్నాయి. ఇకపోతే తాజాగా మామగారు లేని రోజులను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది నమ్రత. సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15వ తేదీన అనారోగ్య సమస్యతో కాంటినెంటల్ ఆసుపత్రి లో చేరారు. 24 గంటలకు పైగా వైద్యులు చికిత్స చేసినా ఆయన మాత్రం కన్నుమూశారు. ముఖ్యంగా ప్రధాన అవయవాల పనితీరు మందగించడంతో కృష్ణ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఏడాది ప్రారంభంలో రమేష్ బాబు మరణించడం.. సెప్టెంబర్ నెలలో ఇందిరా దేవి మరణం .. నవంబర్లో కృష్ణ మృతి చెందడం అన్నీ కూడా ఘట్టమనేని కుటుంబాన్ని కుంగదీశాయి.

ఇలా దెబ్బ మీద దెబ్బ పడటంతో మహేష్ బాబు సైతం కుంగిపోయాడు. తన తండ్రి మరణాన్ని తలుచుకుంటూ కన్నీరు పెట్టుకుంటున్నాడు.. తన తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తానని మాట ఇచ్చిన మహేష్ బాబు తన తండ్రి.. తనతోనే ఉన్నాడని.. ఇదివరకంటే ఎక్కువ ధైర్యం.. సత్తా.. శక్తి తనలో ఉందని చెప్పుకొచ్చారు. మహేష్ బాబు తన తండ్రిని తలుచుకుంటూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడమే కాకుండా అభిమానులు సైతం కంటతడి పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోని ఇప్పుడు నమ్రత కూడా మహేష్ బాబు లాగానే స్పందించింది.

ఆమె తన పోస్టు ద్వారా తన మామ గారి పాత ఫోటో ల వీడియో ను షేర్ చేస్తూ ఇలా రాసుకుంది. “ఎప్పటికీ నిలిచిపోయే సూపర్ స్టార్ .. ఎన్నింటికో పునాది వేసి నిజమైన ట్రెండ్ సెట్టర్గా నిలిచారు.. ఆయనకు సినిమా పట్ల ఉన్న పిచ్చి, ప్యాషన్, ప్రేమ వల్లే సూపర్ స్టార్ అయ్యారు. ఆయన ఎప్పటికీ సూపర్ స్టారే.. నాకు ఆయన తెలియడం.. ఆయనను మామగారు అని పిలవడం .. నా అదృష్టం.. జీవిత పాఠాలు ఎన్నో ఆయన దగ్గర నేర్చుకున్నాను .అవన్నీ ఎప్పుడు పాటిస్తూనే ఉంటాము. ఆయన ఖ్యాతిని ఎప్పటికీ మేం పండుగలా జరుపుకుంటేనే ఉంటాము.. లవ్ యు మామయ్య గారు ” అని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Read more RELATED
Recommended to you

Latest news