పవన్‌ వీకెండ్ సైకో.. మా ఇళ్లు కులుస్తావా..? : మంత్రి జోగి రమేష్‌

-

ఏపీలో రాజకీయం వేడెక్కింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే.. తాజాగా ఏపీ మంత్రి జోగి రమేష్ జనసేనాని పవన్ కళ్యాణ్ వీకేండ్ సైకో అంటూ మండిపడ్డారు. నేడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటం గ్రామానికి చెందిన 37 మందికి పవన్ కళ్యాణ్ ఇవాళ ఆర్ధిక సహాయం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వైసీపీపై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడించి తీరుతామన్నారు. పవన్ కళ్యాణ్ కు సత్తా ఉంటే ఒంటరిగా పోటీ చేయాలని మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. కోడికత్తి రాజకీయాలు అనే విమర్శలకు 151 అసెంబ్లీ స్థానాలను వైసీపీకి కట్టబెట్టి ప్రజలు సమాధానం చెప్పారన్నారు.

Andhra Pradesh SEC restrains MLA Jogi Ramesh from speaking to media

ఇప్పటం ప్రజలను పవన్ కళ్యాణ్ నిలువునా ముంచేశారని ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్ చిల్లర వేషాలు మానుకోవాలని హితవు పలికారు జోగి రమేష్. ఇవాళ ఇప్పటం గ్రామస్తులకు ఆర్ధిక సహయం ఇచ్చే కార్యక్రమంలో వైసీపీపై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుంటే చూస్తూ కూర్చుంటామా పవన్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ శ్రేణులపై బెదిరింపులకు పాల్పడితే 2024 ఎన్నికల తర్వాత ఏం చేయాలో అది చేస్తామన్నారు జోగి రమేష్.

Read more RELATED
Recommended to you

Latest news