కమల్ హాసన్ ‘విక్రమ్’లో అతిథి పాత్రలో సూర్య..రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?

-

లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ‘విక్రమ్’ కు విశేష స్పందన లభిస్తోంది. కమల్ అభిమాని లోకేశ్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ పిక్చర్ లో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం రెండు రోజుల్లోనే వంద కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరి సత్తా చాటుతోంది.

ఈ చిత్రం చివరలో వెర్సటైల్ యాక్టర్ సూర్య అతిథి పాత్రలో కనిపించి అభిమానులను అలరించారు. సూర్య పాత్ర వెండితెరపైన అత్యద్భుతంగా ఆవిష్కరించబడగా, అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. ఇక ‘రోలెక్స్’ పాత్ర పోషించడం ద్వారా తనకు కమల్ హాసన్ తో నటించే అదృష్టం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు హీరో సూర్య. ట్విట్టర్ వేదికగా కమల్ కు థాంక్స్ చెప్పారు.

కమల్ హాసన్ సినిమాలో ఫ్రీగానే సూర్య నటించాడని కోలీవుడ్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. కాగా, కమల్ హాసన్ బ్యానర్ లో నటించినందుకుగాను నిర్వాహకులు రెమ్యునరేషన్ ఇచ్చేశారని మరికొందరు అంటున్నారు. గెస్ట్ రోల్ అయినందున సూర్య రూ.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news