నటి శ్రీలక్ష్మీ జీవితంలో ఆ విషయమై అంత విషాదం..

-

తెలుగు చిత్ర సీమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలక్ష్మీ. నిర్మాత అమర్ నాథ్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలక్ష్మీ..తండ్రికి తగ్గ తనయగా నిరూపించుకుంది. తండ్రికి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడిన క్రమంలో నటిగా పరిచయమై కుటుంబ బాధ్యతలు తీసుకుంది.

శ్రీలక్ష్మి సోదరుడు రాజేశ్..హీరోగా పలు సినిమాలు చేశారు. ఆయన కూతురు ఐశ్వర్యా రాజేశ్ ప్రస్తుతం..విలక్షణ నటిగా దూసుకుపోతున్నది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో హీరోయిన్ గా చక్కటి పాత్రలు పోషిస్తోంది.

ఆర్థిక ఇబ్బందుల వలన ఫిల్మ్స్ లోకి వచ్చిన శ్రీలక్ష్మీ..కె.విశ్వనాథ్, జంధ్యాల చిత్రాల్లో చక్కటి పాత్రలు పోషించి ప్రేక్షకుల ఫేవరెట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఈమె జీవితంలో అనుకోని విషాదం తర్వాత ఏర్పడింది. కుటుంబ బాధ్యతలు తీసుకున్న ఈమె వ్యక్తిగత జీవితం గురించి పక్కన పెట్టేసింది. పిల్లలే కదా తర్వాత పుడతారనుకుని ..పిల్లల గురించి ఆలోచించలేదు.

ఒకవేళ ఇప్పుడే పిల్లలు పుడితే కెరీర్ కు ఇబ్బంది అవుతుందని ఆలోచించి ..ఇంటి ఆర్థిక సమస్యలు పరిష్కారించాలనుకుంది. అలా ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించుకుంది. కానీ, తర్వాత పిల్లల కోసం ప్రయత్నించినప్పటికీ ఆమెకు పిల్లలు కాలేదు. వయసు పెరగడంతో పాటు థైరాయిడ్ సమస్య వలన శ్రీలక్ష్మీకి పిల్లలు లేకుండా పోయారు. తాను పిల్లలే కదా మళ్లీ పుడుతారని అనుకున్నానని, కానీ, ఇలా జరుగుతుందని అనుకోలేదని వాపోయింది నటి శ్రీ లక్ష్మీ. ప్రస్తుతం పలు సీరియల్స్ తో పాటు ఈటీవీ కార్యక్రమాల్లో నటిస్తోంది శ్రీలక్ష్మీ.

Read more RELATED
Recommended to you

Latest news