పవన్ చేయాల్సిన “అరవింద సమేత” ఎన్.టి.ఆర్ చేయడానికి కారణం ఎవరో తెలుసా ..?

-

మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా అరవింద సమేత వీర రాఘవ. హారిక అండ్ హాసిని క్రియోషన్స్ బ్యానర్ పై ఎస్.రాధా కృష్ణ నిర్మించారు. పూజా హెగ్డే ఎన్.టి.ఆర్ సరసన నటించింది. 2018 అక్టోబర్ లో రిలీజయిన ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. 150 కోట్ల కి పైనే వసూళ్ళని రాబట్టింది. అజ్ఞాతవాసి వంటి భారీ డిజాస్టర్ తర్వాత త్రివిక్రం నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద వాస్తవంగా అందరూ అనుమానాలని వ్యక్తం చేశారు.

 

కాని అందరి అంచనాలను తారుమారు చేస్తూ భారీ హిట్ ని సొంతం చేసుకుంది. ఎన్.టి.ఆర్ ఇంట్రడక్షన్ ఫైట్ ఒక్కటే ప్రేక్షకులను థియోటర్స్ లో కట్టి పడేసింది. అంతటి భారీ యాక్షన్ సీన్ ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు త్రివిక్రం. ఈ ఫైట్ లో ఎన్.టి.ఆర్ ఎలివేషన్ కి ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యారు. ఇక థమన్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎసెట్ గా నిలిచింది.

అయితే వాస్తవంగా ఈ కథ ని ముందు త్రివిక్రం పవన్ కళ్యాణ్ కోసమే రాసారట. అజ్ఞాతవాసి ఫ్లాప్ ఫ్యాన్స్ తో పాటు అందరిని దారుణంగా నిరుత్సాహపరచడంతో ఎలాగైనా మళ్ళీ పవర్ స్టార్ కి ఒక భారీ సక్సస్ ఇవ్వాలన్న కసితో అరవింద సమేత కథ రాసి పవన్ కళ్యాణ్ కి వినిపించారట. కాని ఈ కథ మొత్తం విన్న పవన్ కళ్యాణ్ ఈ కథ నాకంటే ఎన్.టి.ఆర్ కి చాలా బావుంటుంది.. సినిమా సూపర్ హిట్టవుతుంది …మనం ఇంకో సినిమా చేద్దాం…ఏమాత్రం ఆలోచించకుండా ఈ కథ ఎన్.టి.ఆర్ కి నచ్చితే చేసేయ్ అని చెప్పారట. దాంతో ఈ సూపర్ హిట్ సినిమా ఎన్.టి.ఆర్ ఖాతాలో పడింది. అందుకు కారణం అయినా పవన్ కళ్యాణ్ కి ఎన్.టి.ఆర్ కృతజ్ఞతలు తెలపడం కూడా విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news