డబ్బింగ్ చెబుతున్న వకీల్ సాబ్ ..టార్గెట్ అదేనా ..?

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ‘వకీల్ సాబ్’ సినిమాతో మళ్లీ సినీ ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. రెండేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తుండటం తో ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందులోను బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాకి అఫీషియల్ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటం … కోలీవుడ్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడం తో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మీదా ఇంకా ఎక్కువగా అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా కి ఒక షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. కరోనా ఎఫెక్ట్ తో ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చిన దిల్ రాజు ఏప్రిల్ నాలుగో వారంలో తిరిగి షూటింగ్ మొదలుపెడతారట.

 

ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్ లో ఒక సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం సూర్య మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కూడా కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ ని నిలిపి వేశారు. ఇక క్రిష్ సినిమా తర్వాత గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ రికార్డ్ ని ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ మరొక సినిమా చేయనున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రం లేదా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేసే అవకాశాలున్నాయి.

ఇదిలా ఉండగా వకీల్ సాబ్ టీం అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించారట. అంతేకాదు పవర్ స్టార్ కూడా ఈ సినిమా డబ్బింగ్ ని తన ఇంటి నుండి పూర్తిచేయనున్నట్లు సమాచారం. వాస్తవంగా అయితే ఈ సినిమాని మే 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడే ప్రకటించారు. అయితే కరోనా ఎఫెక్ట్ షూటింగ్ కి బ్రేక్ పడినప్పటికి రిలీజ్ డేట్ ని దృష్ఠిలో పెట్టుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని పూర్తి చేస్తున్నారట. మరో రెండు మూడు వారాలలో కరోనా కంట్రోల్ లోకి వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి మిగతా కార్యక్రమాలని పూర్తి చేసి అనుకున్న డేట్ కి సినిమా రిలీజ్ చేయాలన్న టార్గెట్ ని మేకర్స్ గట్టిగా పెట్టుకున్నారని అర్థమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news