హైదరాబాద్ చేరిన ‘RRR’ చిత్రబృందం.. అభిమానుల ఘస్వాగతం

-

‘ఆస్కార్‌’ అవార్డు సాధించిన ఆర్ఆర్ఆర్ బృందం అమెరికా నుంచి హైదరాబాద్​ చేరుకుంది. ఇవాళ తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్​పోర్టులో ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అభిమానులు ఘనస్వాగతం పలికారు. రాజమౌళి ఫ్యామిలీని ఫ్యాన్స్ చుట్టుముట్టారు. రాజమౌళి, ఆయన సతీమణి రమ, కీరవాణి, ఆయన సతీమణి వల్లి, కార్తికేయ, కాలభైరవ, శ్రీసింహా, తదితరులకు అభిమానులు గ్రాండ్​గా వెల్​కమ్ చెప్పారు.

రాజమౌళి, కీరవాణితో ఫొటోలు దిగేందుకు వారు ఆసక్తి కనబరిచారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌ ప్రాంగణం రద్దీగా మారింది. కట్టు దిట్టమైన భద్రత నడుమ కీరవాణి, రాజమౌళి ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వచ్చారు. మరోవైపు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌తో మాట్లాడేందుకు పలువురు విలేకర్లు ప్రయత్నించగా.. ‘జైహింద్‌’ అంటూ రాజమౌళి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విజువల్స్‌ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

మరోవైపు రామ్ చరణ్ అమెరికా నుంచి దిల్లీ చేరుకున్నారు. ఇవాళ దిల్లీలో జరిగే ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్‌’లో అతిథిగా పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం ప్రధానీ మోదీని కలిసే అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Latest news