గీత మీద గీతా ఆర్ట్స్ కన్ను..!

-

టాలీవుడ్ లో ఎవరు ఎప్పుడు ఎలా క్లిక్ అవుతారో తెలియదు కొందరు భాలౌ సినిమాలు చేస్తూ క్రేజ్ తెచ్చుకుంటుంటే మరికొందరు ఎంట్రీతోనే స్టార్ క్రేజ్ తెచ్చుకుంటారు. ఈ కోవలోనే వస్తుంది ఛలో హీరోయిన్ రష్మిక మందన్న. కన్నడ కిరాక్ పార్టీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన ఈ అమ్మడు తెలుగులో ఛలో, గీతా గోవిందం, దేవదాస్ సినిమాలతో సూపర్ పాపులారిటీ సంపాదించింది.

ఇక యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోయిన్స్ మీద దర్శక నిర్మాతల కన్ను అన్నట్టుగా రష్మిక మీద బడా నిర్మతల కన్ను ఉంది. వారిలో ముఖ్యంగా గీతా ఆర్ట్స్ రష్మిక మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ బ్యానర్ లో వచ్చిన గీతా గోవిందంలో గీతగా అలరించిన రష్మిక మరోసారి బ్యానర్ లో సినిమా చేస్తుందని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మారుతి డైరక్షన్ లో సాయి ధరం తేజ్ హీరోగా వస్తున్న సినిమాకు రష్మికను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట.

గీత తోని మళ్లీ గీతా గోవిందం లాంటి హిట్ కొట్టాలని చూస్తున్నారు అల్లు అరవింద్ అండ్ టీం.. ఈసారి హీరో కూడా మెగా మేనళ్లుడే కాబట్టి ఇంకాస్త స్పెషల్ ఫోకస్ పెట్టారట. మరి తేజూతో రష్మిక రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news