రేపే హీరో నిఖిల్ వివాహం ..ఎక్కడో.. ఎవరెవరు హాజరవుతున్నారో తెలుసా ..?

-

టాలీవుడ్ లో వరసగా పెళ్ళి భాజాలు మోగుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా టాలీవుడ్ సెలబ్రిటీస్ తమ పెళ్ళి కబుర్లను, పెళ్ళి కార్యక్రమలను జరుపుకుంటూ సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. రీసెంట్ గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు వైగా రెడ్డిని రెండవ పెళ్ళి చేసుకున్నాడు. నిజామాబాద్ లో లక్ష్మీ నరసింహ స్వామీ ఆలయంలో ఈ వేడుక అత్యంత సన్నిహితుల మద్య జరిగింది. ఇక దగ్గుబాటి రానా కూడా తన ప్రేమను వెల్లడించాడు. ముంబై లో స్థిరపడ్డ హైదరాబాదీ అయిన మిహికా బజాజ్ కి ప్రపోజ్ చేయగా తను ఒకే చెప్పిందంటూ అధికారకంగా వెల్లడించాడు.

 

దాంతో త్వరలో దగ్గుబాటి ఫ్యామిలీలో పెళ్ళి బాజాలు మోగబోతున్నాయనుకుంటుండగానే టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన పెళ్ళి రేపే అంటూ స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చి ఫ్యాన్స్ కి షాకిచ్చాడు. వాస్తవంగా ఏప్రిల్ 16 న పెళ్ళి నిశ్చయించారు. కాని లాక్ డౌన్ కారణంగా ఈ యంగ్ హీరో పెళ్ళి వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు నిఖిల్ రేపు పెళ్ళి చేసుకోబోతున్నాడు. పెద్దలు నిశ్చయించిన ముహూర్తానికి పల్లవి వర్మను వివాహమాడనున్నాడు నిఖిల్.

షామిర్ పెట్ గెస్ట్ హౌస్ లో రేపు ఉదయం 6.10 నిమిషాలకు పెళ్లి జరగనుండగా లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా కేవలం అత్యంత సన్నిహిఉల మద్యనే జరగనుందట. ఇక ఈరోజు రాత్రి కి కుటుంబ సభ్యులు నిఖిల్ ని పెళ్లి కొడుకు చేయనున్నారు. నిఖిల్ పెళ్ళి చేసుకుంటుంది భీమవరానికి చెందిన వైధ్యురాలు పల్లవి వర్మ అన్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీడేస్ సినిమాతో పరిచయమైన నిఖిల్ టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపుని దక్కించుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా అర్జున్ సురవరం తో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం కార్తికేయ 2 కి కమిటయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news