హీరో నితిన్ ఎమోషనల్ పోస్ట్..

-

నితిన్ తన ఇంస్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. జయం సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయిన నితిన్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నాడు. నితిన్ ప్రస్తుతం “మాచర్ల నియోజకవర్గం” సినిమా చేస్తున్నాడు.

కాగా నితిన్ సినీ ప్రయాణం మొదలుపెట్టి నేటితో రెండు దశాబ్దాలు పూర్తిచేసుకున్న సందర్భంగా తన ఇంస్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ చేశారు.” 20 ఏళ్ల క్రితం జయం సినిమాతో నా సినీ ప్రయాణం మొదలు పెట్టాను. ఇప్పుడు నేను ఏం చెప్పాలో కూడా నాకు మాటలు రావట్లేదు. మొదటగా నన్ను నమ్మి నటునిగా వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు తేజ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.

నా మిగతా దర్శకులు, నిర్మాతలు, నటులు, టెక్నీషియన్స్ ఇలా నేను పనిచేసిన సినిమాకు ప్రతి ఒక్కరికీ థాంక్స్. ముఖ్యంగా ఇన్నేళ్లుగా నన్ను అభిమానిస్తూ, నన్ను ఫాలో అవుతూ చెరగని ప్రేమను అందిస్తున్న అభిమానుల ప్రేమకు అయితే ఎప్పటికీ హృదయపూర్వకంగా రుణపడి ఉంటాను.” అంటూ చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news