ఏపీలో దారుణం.. జర్నలిస్టులమంటూ మహిళపై లైంగిక దాడి !

-

జర్నలిస్ట్ గా చలామణి అవుతూ లైంగిక దాడికి పాల్పడడం నకిలీ జర్నలిస్టు ను అరెస్టు చేసినట్లు విశాఖ ఏసీపీ పెంటా రావు పేర్కొన్నారు. పెందుర్తి లో మీడియా ఛానెల్స్ విలేకరులం అంటూ డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు రౌడీ షీటర్ లను అదుపులోకి తీసుకున్నాము..ఏ నెల 7వ తేదీన పెందుర్తి సుజాత నగర్ లో ఓ యువతి పై అత్యాచారం చెయ్యడంతో పాటుగా రెండు గోల్డ్ రింగ్ లు దొంగతనం చేశారని తెలిపారు.

రౌడీ షీటర్ వంకా కుమార్ టీవీ 10 రిపోర్టర్ గా చెలామణి అవుతూ గబ్బా శేఖర్ అనే మరొక రౌడీ షీటర్ ను అదుపులోకి తీసుకున్నాము..గతంలో ఈ వంకా కుమార్ డాక్టర్ అజిత్ కుమార్ పేరుతో 15 మంది అమ్మాయిలను మోసం చేసాడన్నారు. మోసాలు చెయ్యడంలో వంకా కుమార్ సిద్ధహస్తుడు..గతంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గాను డ్రైవర్ గాను, డాక్టర్ గాను పనులు చేస్తున్నా అని నమ్మించేవాడని తెలిపారు.మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకొని వారి దగ్గర లక్షలు వసూలు చేశారు..గబ్బా శేఖర్ మీద ఒక హత్య కేసు, హత్యా యత్నం కేసు నమోదైందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news