పెళ్లైన ఏడాదికే విడిపోతున్న‌ హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్.. రీజ‌న్ తెలిస్తే..

-

తన భర్తతో విడిపోతున్నట్టు సినీ హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ వెల్లడించింది. సినీ రంగానికే చెందిన రోహిత్ మిట్టల్ ను ఏడాది క్రితం ఆమె పెళ్లాడింది. పెళ్లై ఏడాది కాకుండానే శ్వేతా బసు వైవాహిక జీవితానికి ముగింపు పలికింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె అభిమానులతో పంచుకుంది. తమ వివాహబంధానికి ముగింపు పలకాలని తాను, రోహిత్ పరస్పరం అంగీకారానికి వచ్చామని శ్వేత తెలిపింది. లోతుగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.

ఇరువురి భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపింది. ప్రతి పుస్తకాన్ని మనం పూర్తిగా చదవలేకపోవచ్చని… దీని అర్థం ఆ పుస్తకం బాగోలేదని కాదని చెప్పింది. తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించినందుకు, తనకు స్ఫూర్తిగా నిలిచినందుకు రోహిత్ కు ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపింది. రోహిత్ భవిష్యత్తు మరింత గొప్పగా ఉండాలని ఆకాంక్షించింది. కాగా, తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ సినిమాల్లో శ్వేత నటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version