ఆది పురుష్ ప్రదర్శించే అన్ని థియేటర్లలో ఒక్క సీటు ఖాళీ.. ఎందుకంటే..?

-

ప్రముఖ పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆది పురుష్. రామాయణం ఆధారంగా వస్తున్న ఈ సినిమా జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ చిత్రం రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో థియేటర్లలో ఒక్క సీటును ఖాళీగా ఉంచబోతుండడం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. హిందూ మైథలాజికల్ ఫిల్మ్ గా మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా కోసం చిత్ర బృందం మునిపెన్నడూ లేని విధంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు .

వినూత్నంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. ఇక ఈరోజు తిరుపతిలో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే ప్రభాస్ తో పాటు టీం మొత్తం కూడా తిరుమల కు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఇక మధ్యాహ్నం అక్కడ్నుంచి ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇకపోతే జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఐదు ప్రధాన భాషలతో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుండడంతో పాటూ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు .అయితే రాముడి పట్ల రామాయణం పట్ల భారతీయులకు ఎంత గౌరవం నమ్మకం ఉందో అందరికీ తెలిసిందే .ఈ సందర్భంగా మేకర్స్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఆదిపురుష్ రిలీజ్ కాబోతున్న థియేటర్లలో ఒక సీటును ఖాళీగానే ఉంచబోతున్నారట ఎందుకంటే రాముడు ఎక్కడ ఉన్నా సరే ఆయనకు జరిగే కార్యక్రమాలు ఉత్సవాలు జరిగే చోట తప్పకుండా హనుమంతుడు ఉంటాడని నమ్మకంతో ఇలా చేస్తున్నారని ఇంత గొప్ప చిత్రాన్ని వీక్షించడానికి తప్పకుండా ఆంజనేయ స్వామి వస్తాడనే సూచకగా ఒక సీటును ఖాళీగా ఉంచబోతున్నారట చిత్ర బృందం. ఏది ఏమైనా హిందువుల నమ్మకాన్ని ఆదిపు మేకర్స్ ఇలా గౌరవించడం చాలా ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news