వకీల్ సాబ్ లో పవన్ కల్యాణ్ తర్వాత హైలెట్ నివేదా థామస్ అట ..!

-

పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్న రీఎంట్రీ సినిమా ‘వకీల్ సాబ్’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇంకో మూడు వారాల్లో షూటింగ్ ను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్స్ ని మొదలు పెడతారని తాజా సమాచారం. ఇందులో భాగంగా గత కొన్ని రోజులుగా కోర్టుకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. కోర్టు సీన్స్ లో పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటిస్తున్నాడట. అయితే తాజాగా మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

 

పవన్ కళ్యాణ్ తో పాటు ఈ సినిమా లో ముఖ్య పాత్రలో నటిస్తున్న నివేదా థామస్ కూడా కోర్టు సీన్స్ లో అద్బుతమైన నటన కబనర్చుతున్నట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. చాలా విభిన్నంగా నివేదా థామస్ పాత్ర ఉంటుంది. హిందీలో ఈ పాత్రను తాప్సీ పోషించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ పింక్ సినిమాలో అమితాబ్ బచ్చన్ తర్వాత అంతగా హైలెట్ అయిన పాత్ర తాప్సీదే. తెలుగులో నివేదా థామస్ అదే పాత్ర ను పోషిస్తోంది. ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేసే విధంగా నివేదా థామస్ చాలా కష్ఠపడుతుందట. సాధారణంగా నివేదా థామస్ ఏ హీరో తో నటించినా పోటీ పడి నటిస్తుంది. ఆ విషయం నానీ, ఎన్.టి.ఆర్ సినిమాలు చూస్తే అర్థమవుతుంది.

ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి నటించడమే కాదు సినిమాలో ఆయన పాత్ర తర్వాత మళ్ళీ నివేదా థామస్ పాత్ర గురించి చెపుకునే విధంగా నటిస్తుందట. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా… బోణీ కపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ తో సినిమాకు ఏ స్థాయి క్రేజ్ ఉందో తేలిపోయింది. పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ సినిమా కావడంతో అటు సినీ వర్గాల్లోను ఇటు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులల్లోను భారీగా అంచనాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news