స్టార్​ హీరోకు లగ్జరీ ఇంటిని అమ్మేసిన జాన్వీ.. ధర తెలిస్తే షాక్​!

-

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్‌. నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనలోని నటికి పదును పెడుతోంది. దీంతో వరుస అవకాశాలు అందుకుంటూ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం జాన్వీ పలు ప్రాజెక్ట్స్‌ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా జాన్వీ తన లగ్జరీ ఇల్లును అమ్మేసిందంటూ బాలీవుడ్‌ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి.

జాన్వి కపూర్
జాన్వి కపూర్

జూహులోని ఓ అపార్టుమెంట్‌లోని తన ప్లాట్‌ను భారీ ధరకు ఓ స్టార్‌ నటుడికి అమ్మినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జూహు-విల్లె పార్లీ అనే అపార్ట్‌మెంట్‌లో గల 14, 15, 16 అంతస్థుల్లో నిర్మించిన ఈ లగ్జరీ ప్లాట్‌ను జాన్వీ 2020లో రూ. 35 కోట్లకు కొనుగొలు చేసిందట. 3456 sqf ఉన్న ఈ ఇంటిని ప్రముఖ నటుడు రాజ్‌ కుమార్‌ రావు రూ. 45 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

జాన్వి కపూర్
జాన్వి కపూర్

కాగా ఇటీవల రాజ్‌కుమార్‌ రావు, తన ప్రియురాలు, సహానటి పత్రలేఖను పెళ్లి చేసుకున్నారు.పెళ్లి తర్వాత వీరిద్దరు ఉండేందుకు ఇంటి కోసం వెతుకుతుండగా జాన్వీని సంప్రదించాడు రాజ్‌ కుమార్‌. అప్పటికే తన లగ్జరీ ప్లాట్‌ను అమ్మాలని చూస్తున్న జాన్వీ రాజ్‌కుమార్‌కు అమ్మినట్లు బి-టౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జుహూలోని ఓ పెద్ద అపార్ట్‌మెంట్‌‌లో 14, 15, 16వ ఫ్లోర్లు కలిపి ఈ ఫ్లాట్ ఉంటుందట. అంతే కాకుండా కేవలం ఈ ఫ్లాట్ల పార్కింగ్ స్పేస్ కోసమే రాజ్‌కుమార్ రావు మరో రూ. 2.19 కోట్లను ఖర్చు చేసినట్టు సమాచారం.

ఇక ఇటీవల జాన్వీకపూర్‌ నటించిన బ్లాక్‌ కామెడీ క్రైమ్‌ చిత్రం ‘గుడ్‌లక్‌ జెర్రీ’ . సిద్ధార్థ్‌ సేన్‌గుప్త దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో జులై 29 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుంది. నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కి, విజయం అందుకున్న తమిళ చిత్రం ‘కొలమావు కోకిల’కు ఈ సినిమా రీమేక్‌. లైకా ప్రొడక్షన్స్‌, కలర్‌ ఎల్లో ప్రొడక్షన్స్‌, మహావీర్‌ జైన్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో దీపక్‌, నీరజ్‌ సూద్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Read more RELATED
Recommended to you

Latest news