జాన్వీ కపూర్ కన్ను ఇప్పుడు మహేష్ బాబు పై పడిందా..?

-

అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ గురించి.. ఆమె అందం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మ తాజాగా టాలీవుడ్ సినిమాలలో నటించడానికి తెగ ప్రయత్నం చేస్తుంది.. ఈ క్రమంలోని మొన్నటి వరకు విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలని చెప్పిన జాన్వీ కపూర్ ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉందని.. ఒకవేళ అవకాశం వస్తే అంతకంటే అదృష్టం ఇంకొకటి లేదు అని చెప్పింది . కానీ ఇప్పుడేమో మహేష్ బాబు పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

మరి మహేష్ బాబు విషయానికి వస్తే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఈయన అందం చూసి స్టార్ హీరోయిన్లు సైతం ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు సైతం మహేష్ బాబు సరసన ఒక్క సినిమాలు నటించే అవకాశం వస్తే చాలు అంటూ ఆలోచిస్తూ ఉంటారు . అలాంటి అందం కలిగి ఉన్నటువంటి మహేష్ బాబు గురించి జాన్వీ కపూర్ కూడా మాట్లాడడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇంటర్వ్యూలో భాగంగా జాన్వీ కపూర్ మహేష్ బాబు గురించి చెబుతూ ఆయన అందం పై పొగడ్తల వర్షం కురిపించింది. మహేష్ బాబు అందం చూస్తే కసిగా తినేయాలనేంత క్రష్ ఉందని తెలిపింది. ఎవరికైనా వయసు పైబడే కొద్ది అందం తగ్గుతుంది. కానీ మహేష్ సార్ కి మాత్రం అందం పెరుగుతోంది . ఈ విషయం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మహేష్ సార్ వైపు చూస్తుంటే తనకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు అంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించింది.

Read more RELATED
Recommended to you

Latest news