తెలంగాణకు కేంద్రం రూ.40 వేల కోట్లు బాకీ.. కేసిఆర్ కీలక నిర్ణయం !

-

అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షల వల్ల 2022-23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు సమకూరవలసిన ఆదాయంలో రూ.40వేల కోట్లకు పైగా తగ్గుదల చోటుచేసుకున్నది. ఇటువంటి చర్యలతో తెలంగాణ అభివృద్ధిని ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తున్నది.

ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు డిసెంబర్ నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావును, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డిని సీఎం ఆదేశించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news