ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా స్టార్ అవబోయోదెవరో తెలుసా …?

-

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా రౌద్రం రణం రుథిరం. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. బాహుబలి ఫ్రాంఛైజీ వంటి హిస్టరీ క్రియోట్ చేసిన సినిమాల తర్వాత మళ్ళీ రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

RRR: Story, budget, full cast and all you need to know about SS ...

ఇక ఈ నెల ఎన్టీఆర్‌ బర్త్ డే సందర్భంగా మే 20న కొమరం భీం పాత్రకి సంబంధించిన వీడియో టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రాజమౌళి టీం ఈ టీజర్ ని తయారు చేసే పనిలో బిజీగా ఉన్నారు. హై ఓల్టేజ్ లో ఈ టీజర్ ఉండబోతుందని ఈ టీజర్ తో ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ రానుందని అంటున్నారు. ఇక ఇప్పటికే తారక్, చరణ్ ఇద్దరు రాజమౌళి సినిమాలో నటించి భారీ సక్సస్ లను అందుకొని ఉన్నారు. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ మీద భారీ అంచనాలు పెరగడానికి ఇది ఒక ముఖ్య కారణం అని చిత్ర పరిశ్రమలో చర్చించుకుంటున్నారు.

Alia – Free video online

ఇక ఫిల్మ్ నగర్ లో తాజాగా జరుగుతున్న చర్చల ప్రకారం RRR తర్వాత టాలీవుడ్ నుండి మరో ఇద్దరికి పాన్ ఇండియా స్టార్స్ క్రేజ్ రానుందని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ గురించే ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ లో రాజమౌళి ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరిని పాన్ ఇండియా స్టార్స్ గా తయారు చేస్తున్నారని ఆర్ ఆర్ ఆర్ యూనిట్ నుండి అందిన విశ్వసనీయ సమాచారం. ఇక ఇప్పటికే రాం చరణ్ బాలీవుడ్ సినిమా చేసి నార్త్ లోనూ క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఎన్.టి.ఆర్ నటించిన సినిమాలు బాలీవుడ్ లో డబ్ అయ్యాయి తప్ప స్ట్రైట్ గా తెరకెక్కింది లేదు. దాంతో ఆర్ఆర్ఆర్ సినిమా తో ఇద్దరిని ప్రభాస్ లా రాజమౌళి పాన్ ఇండియా స్టార్స్ గా మార్చాలని నిర్ణయించుకున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news