న‌లుగురు యంగ్ హీరోలు దండయాత్ర చేస్తోన్నా.. వెన‌క్కి త‌గ్గ‌ని కీర్తి సురేష్‌..!

-

అల‌నాటి మ‌హాన‌టి సావిత్రి పాత్ర‌లో త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించి అంద‌రితో శ‌భాష్ అనిపించుకోవడమే కాదు.. జాతీయ ఉత్తమనటి అవార్డును కీర్తి సురేష్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్‌ ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తోన్న చిత్రం ‘మిస్ ఇండియా’. మ‌హిళ‌ల‌పై జ‌రిగే అకృత్యాల నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మ‌హేష్ కొనేరు నిర్మిస్తున్న ఈ సినిమాలో నరేష్, నదియా, రాజేంద్రప్రసాద్, కమల్ కామరాజు, భానుశ్రీ మెహ్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నరేంద్ర అనే నూతనదర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ సినిమాతో మరోసారి లేడీ ఓరియేంటెడ్‌ పాత్రలో కనిపించబోతుంది కీర్తి. అలాగే మార్చిలో సినిమాని విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించిన యూనిట్ తాజాగా ఏప్రిల్ 17న మిస్ ఇండియాని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. అయితే నాని ‘టక్ జగదీష్’ తో వస్తున్నాడు. శర్వానంద్ ‘శ్రీకారం’, అఖిల్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, రామ్ ‘రెడ్’ అంటూ ఏప్రిల్‌లో రిలీజ్‌లకు రెడీ అయిపోయారు. ఇంతమంది యంగ్ హీరోలు దండయాత్ర చేస్తోన్నా మహానటి వెనక్కి తగ్గడం లేదు. రేస్‌కి రెడీ అంటూ లైన్‌లోకి వచ్చేసింది. మరి కీర్తి ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మిస్ ఇండియా’ ఎంతవరకు మెస్మరైజ్ చేస్తోందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news