కియరా మాయలో టాలీవుడ్

-

టాలీవుడ్ లో స్టార్ హీరోలకు సరైన జోడీ కుదరచడం అంటే మాములు విషయం కాదు. కొత్త భామలు ఎంట్రీ ఇస్తున్నా ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా పెద్దగా రాణించడం లేదు. ఈ క్రమంలో స్టార్స్ ఆ ఒకరిద్దరితోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. సమంత, రకుల్, అనుష్క, కాజల్ అంటూ కోరిన స్టార్స్ ఇప్పుడు వారు ఔట్ డేటెడ్ కొత్త భామల మీద కన్నేశారు.

ఇక అందివచ్చిన ఈ అవకాశాన్ని చక్కగా వాడుకుంటుంది డిజే బ్యూటీ పూజా హెగ్దె. తెలుగులో ముకుంద, ఒక లైలా కోసం సినిమాలు చేసినా రాని క్రేజ్ టూ పీస్ బికినితో కనిపించే సరికి వచ్చింది. ఇక ఇప్పుడు అమ్మడు వరుస స్టార్ అవకాశాలను అందుకుంటుంది. అయితే పూజాతో పాటుగా ఈక్వల్ క్రేజ్ తెచ్చుకుంది మరో బాలీవుడ్ భామ కియరా అద్వాని. ఎమ్మెస్ ధోని అన్ టోల్డ్ స్టోరీలో నటించిన కియరా తెలుగులో భరత్ అనే నేను సినిమాలో నటించింది.

మహేష్ పక్కన ఛాన్స్ కొట్టేస్తే ఇక అమ్మడి రేంజ్ ఎలా ఉంటుందో తెలుసుగా.. అందుకే భరత్ అనే నేను పూర్తి కాగానే చరణ్ వినయ విధేయ రామలో ఛాన్స్ దక్కించుకుంది. వివిఆర్ ట్రైలర్ చూస్తే ఇది పక్కా కమర్షియల్ సినిమాలా ఉన్నా ఈ సినిమా కూడా కియరాకి హిట్ ఇస్తుందని అనిపిస్తుంది. అందుకే కియరా కోసం స్టార్స్ డైరక్టర్స్ క్యూ కడుతున్నారట. స్టార్స్ కూడా ఆమెతో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. మరి చూస్తుంటే రానున్న రోజుల్లో కియరా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మారిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news