Sarkaru Vaari Paata: మ.. మ.. మహేషా.. సాంగ్ ప్రోమో రిలీజ్..గత్తర లేపిన మహేష్ బాబు !

-

టాలీవుడ్‌ స్టార్‌ హీరో, ప్రిన్స్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా “సర్కారు వారి పాట”. ఈ సినిమాకు టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ అండ్ మాస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు… మహానటి కీర్తిసురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా కు నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.ఇది ఇలా ఉండగా సర్కారు వారి పాట సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

ఈ సినిమా నుంచి మ.. మ.. మహేషా సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు కాసేపటి క్రితమే ఈ సాంగ్‌ ప్రోమోను విడుదల చేసింది చిత్ర బృందం. అలాగే.. ఈ మ.. మ.. మహేషా ఫుల్‌ సాంగ్ ను మే 7 వ తేదీ అంటే రేపు విడుదల చేస్తున్నట్లు పేర్కొంది చిత్ర బృందం. కాగా ఈ మూవీ మే 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news