మహేష్, బన్నీ ఫ్యాన్స్ మధ్య ముదురుతున్న వార్…..!!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టైలిష్ స్థార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఈ ఇద్దరూ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురములో సినిమాలు కేవలం ఒక్క రోజు గ్యాప్ తో 2020 సంక్రాంతి బరిలో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముందుగా ఒకే రోజున తమ సినిమాలు రిలీజ్ చేస్తున్నట్లు ఈ రెండు సినిమాల నిర్మాతలు ప్రకటించడం జరిగింది. అయితే ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజున రిలీజ్ అయితే, దాని వలన ఫస్ట్ డే ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ ఎంతో పడుతుందని భావించిన కొందరు ఇండస్ట్రీ పెద్దలు,

రెండు సినిమాల నిర్మాతల మధ్య సయోధ్య కుదిర్చి చివరికి సరిలేరు సినిమాను ఒక రోజు ముందుకు, అనగా జనవరి 11న రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యారు. కాగా అలవైకుంఠపురములో మాత్రం ముందుగా అనుకున్న విధంగానే జనవరి 12న రిలీజ్ కాబోతోంది. మహేష్ మరియు అనిల్ రావిపూడిల తొలి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు పై మహేష్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక బన్నీ మరియు త్రివిక్రమ్ ల కాంబోలో ఇదివరకు జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకోవడంతో, అలవైకుంఠపురములో కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందని బన్నీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 

ఇక ఇటీవల ఈ రెండు సినిమాల సాంగ్స్ మరియు ఫస్ట్ లుక్ టీజర్లు బయటకు వచ్చి మంచి ప్రేక్షకాదరణ సంపాదించాయి. అయితే అలవైకుంఠపురములో సాంగ్స్ మాత్రం అత్యద్భుతంగా యూట్యూబ్ లో లైక్స్ మరియు వ్యూస్ దక్కించుకోవడం, అయితే సరిలేరు నీకెవ్వరు సాంగ్స్ కు ఆశించిన రేంజ్ లో వ్యూస్, లైక్స్ రాకపోవడంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వాదించుకుంటున్నారు. ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో వీరి వాదనపై చర్చలు జరుగుతున్నాయి. మరి ఫైనల్ గా సంక్రాంతి విన్నర్ గా ఈ ఇద్దరు హీరోల్లో ఎవరు నిలుస్తారో తెలియాలంటే మరికొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే…..!!

Read more RELATED
Recommended to you

Latest news