అలాంటి స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్న మహేశ్ .. ప్రభాస్ – ఎన్‌టి‌ఆర్  లకి ధీటుగా నిలబడేందుకే ?

-

ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరూ పాన్‌ ఇండియా తరహాలో సినిమా సబ్జెక్టు ఉండేలా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో ముందుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమా తో ప్రపంచ స్థాయిలో విజయాన్ని సాధించి పాన్‌ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు. బాహుబలి విజయంతో అంతర్జాతీయస్థాయిలో మంచి మార్కెట్ ఏర్పడటంతో… తన తర్వాత ‘సాహో’ సినిమా అనేక భాషలో చిత్రీకరించడం జరిగింది.Jr NTR Has Least Number Of Flop Movies In His Careerఇప్పుడు ఇదే తరహాలో చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమాలను ఇతర భాషల్లో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడు రిలీజైన ‘పుష్ప’ ఫస్ట్ లుక్ పాన్‌ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్నట్లు ఐదు భాషల్లో పోస్టర్స్ ని విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా పాన్‌ ఇండియా తరహాలో త్వరలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు  ఫిలిం నగర్ లో వార్తలు జోరుగా వినబడుతున్నాయి.

 

అయితే వరుస విజయాల మీద ఉన్న మహేష్ బాబు కూడా ఇదే ఫార్ములా ఫాలో అవ్వాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాన్‌ ఇండియా స్క్రిప్ట్ కోసం ప్రభాస్ – ఎన్‌టి‌ఆర్ లకి ధీటుగా సినిమా ఉండేవిధంగా యూనివర్సల్ సబ్జెట్స్‌ స్టోరీ కలిగిన వాటిపై మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారట. ఒక్క ప్రాంతం లేదా భాషకు పరిమితం అవ్వకుండా ఉండేలా పాన్‌ ఇండియా లెవల్‌లో అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు ఆకట్టుకునేలా స్క్రిప్ట్‌ ఉండేలా మహేష్‌బాబు తన తర్వాత సినిమాని ప్లాన్‌ చేస్తున్నారట. దీంతో పరశురాం తో మహేష్ సినిమా ఉంటుందో లేదో అన్నది ఎవరికి అర్థం కావటం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news