ఫ్యాన్ కి షాక్ ఇచ్చిన మహేష్ బాబు ..!

-

టాలీవుడ్ స్టార్ హీరోల్లో మహేష్ బాబుకి ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఎక్కడ కనపడినా సరే అభిమానులు ఫోటో దిగడానికి ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా విమానాశ్రయాల్లో ఆయన కనపడితే చాలు ఫోటో కోసం ఎగబడిపోతూ ఉంటారు అభిమానులు. తాజాగా ఇలాగే చేసాడు ఒక ఫ్యాన్. ఇదే మహేష్ బాబుకి ఆగ్రహం తెప్పించింది. ఒక విమానాశ్రయంలో మహేష్ బాబు కనపడ్డాడు.

మహేష్ కనపడగానే అతను వీడియోలు, ఫోటోలు తీస్తున్నాడు. దీనితో అతన్ని గమనించిన మహేష్ బాబు, చేతిలో ఫోన్ లాక్కున్నాడు. ఎప్పుడు ఇదే పనా బోర్ కొట్టదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనితో అక్కడ ఉన్న వారు అందరూ ఒక్కసారిగా నవ్వేసారు. ఇక మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

సరిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్ అందుకున్న మహేష్ బాబు ఇప్పుడు వంశీ పైడపల్లి తో సినిమా చెయ్యాలని చూసాడు. అయితే వంశీ అందుకు ఆసక్తి చూపించకపోవడమో లేక మహేష్ దూరంగా ఉండటంతో తెలియదు గాని ఆ సినిమా ఆగిపోయింది అంటున్నారు. దీనితోనే పరుశురం తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news