వెన్నెల కిషోర్-మహేశ్ బాబు ఈసారి చించేస్తారట..‘సర్కారు వారి పాట’ నెక్స్ట్ లెవల్

-

తెలుగు సినిమాల్లో ఒకప్పుడు కామెడీ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఆరోగ్యకరమైన కామెడీ సీన్స్ ను వెండితెర పైన పండించేందుకు దర్శకులు చాలా ప్రయత్నించేవారు. అయితే, సినిమా మేకింగ్ లో వచ్చిన మార్పుల క్రమంలో హీరోలే కమెడియన్స్ అయిపోయారు. వారికి సపోర్టర్స్ గా కొందరు కమెడియన్స్ వచ్చేశారు.

సీనియర్ కమెడియన్స్ సైతం కాలం చేశారు. ఏవీఎస్, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎంఎస్ నారాయణ, వేణుమాధవ్..లు లేకపోవడంతో వారి స్థానం భర్తీ చేయడానికి కొందరు కమెడియన్స్ వచ్చారు. సునీల్, వెన్నెల కిషోర్ కొంత మేరకు వారి పరిధిలో ప్రయత్నిస్తున్నారు.

తనదైన స్టైల్ కామెడీ, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను అలరిస్తున్న వెన్నెల కిషోర్..ఈ సారి మరింత ఫన్ క్రియేట్ చేయడానికి వచ్చేస్తున్నారు. మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రంలో మహేశ్ బాబు – వెన్నెల కిషోర్ మధ్య కామెడీ సీన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల విడుదలైన ‘ఆచార్య’ పిక్చర్ లోనూ వెన్నెల కిషోర్ కనిపించారు. కానీ, ఆయన పాత్రకు తగిన ప్రయారిటీ లభించలేదనే వార్తలొస్తున్నాయి. కాగా, ‘‘సర్కారు వారి పాట’’లో మాత్రం మహేశ్ బాబు-వెన్నెల కిషోర్ ల మధ్య సీన్స్ వేరే లెవల్ లో ఉంటాయని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.

‘ఖలేజా’ సినిమాలో మహేశ్ బాబు-సునీల్, ‘దూకుడు’ సినిమాలోని మహేశ్ బాబు- వెన్నెల కిషోర్ మధ్య ఎటువంటి కెమిస్ట్రీ అయితే వర్కవుట్ అయిందో..అటువంటి కెమిస్ట్రీ ., ఫన్ జనరేషన్ కు ‘సర్కారు వారి పాట’ కేరాఫ్ అని అంటున్నారు. పరశురామ్ గత చిత్రం ‘గీతా గోవిందం’లో తనదైన కామెడీ టైమింగ్, యాక్టింగ్ తో జనాలను ఫిదా చేసిన వెన్నెల కిషోర్..‘సర్కారు వారి పాట’లోనూ చించేస్తారట.

Read more RELATED
Recommended to you

Latest news