మహేష్ ఫాన్స్ లో భయం, కారణం అదేనా…?

-

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనీల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. శనివారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే. భరత్ అను నేను, మహర్షి సినిమాలు ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ అభిమానులు ఎలా అయినా ఈ సినిమా విజయం సాధించి భారీగా వసూళ్లు సాధించాలని కోరుతున్నారు.

మహేష్ సినిమా అనగానే ఫాన్స్ లో భారీగా క్రేజ్ ఉంటుంది. అయితే ఇప్పుడు మహేష్ ఫాన్స్ మాత్రం భయపడుతున్నారు. దానికి కారణం ఏంటీ అనేది ఒకసారి చూద్దాం. మహేష్ సినిమాలు రెండు వరుసగా హిట్ అయితే మూడో సినిమా హిట్ అవుతుందో లేదో గ్యారెంటీ లేదు. దానికి తోడు ఈ సినిమాలో మహేష్ కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు అనే ప్రచారం కూడా ఇప్పుడు జరుగుతుంది.

ఇక ప్రమోషన్ కూడా ఈ సినిమాకు ఎక్కువగానే చేస్తున్నారు. ప్రమోషన్ చేసిన సినిమాలు గత ఏడాది బోల్తా పడ్డాయి. దీనితో మహేష్ అభిమానుల్లో ఇప్పుడు భయం నెలకొంది. ఎం జరుగుతుందో ఏంటో అంటూ వాళ్ళు ఆవేదనగా ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో రెండు జిల్లాల్లో మహేష్ సినిమాను ప్రేక్షకులు బ్యాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవన్ని వసూళ్ళ మీద ప్రభావం చూపిస్తాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news