టాప్ డైరక్టర్స్ ప్రాజెక్టులు వరుసగా వదిలేసిన మహేశ్

-

ప్రిన్స్ మహేష్ బాబు డైరెక్టర్ల మ్యాటర్లో క్లారిటీతో లేడా అనిపిస్తుంది.ముందుగా అనుకున్న డైరెక్టర్ ను కరెక్ట్ టైమ్ వచ్చేసరికి వద్దనుకుంటున్నాడు. ఇప్పటికే ఇలా ముగ్గురు ,నలుగురి దర్శకుల విషయంలో జరగడంతో …ప్రిన్స్ కన్ఫ్యూజన్ టాపిక్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. టాలీవుడ్ టాప్ హీరోలు కంటెంట్ మ్యాటర్ లో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు.అవతల దర్శకుడు ఎవరనే విషయాన్ని కూడా చూడడం లేదు.మొహమాటంతో మూవీ చేస్తే మైలేజ్ పోతుందనే భయాన్ని మన హీరోలు ఎప్పుడో గుర్తించారు.అందుకే ఏం చేసినా ఆచితూచి అడుగులు వేయాలని చూస్తున్నారు.

mahesh babu gave life to a child suffering from a chronic disease

ఈప్రాసెస్ లో ముందుగా అనుకున్న దర్శకులను లాస్ట్ మినిట్ డ్రాప్ చేసుకుంటున్నారు.దీంతో టాలీవుడ్ హీరోలలో ఎవరెవరు ఏయే దర్శకుడిని సైడ్ చేస్తుంది అనే విషయంపై సీరియస్ గానే డిస్కషన్ నడుస్తుంది. హీరోలను సైడ్ చేస్తున్న టాప్ హీరోలలో అదేంటో అందరికీ మహేషే కనిపిస్తున్నాడు.చిరు,చెర్రీలు కూడా ఈ లిస్ట్ లో ఉన్నప్పటికీ ప్రిన్స్ భాగా హైలెట్ అవుతున్నాడు.గత కొన్నేళ్లుగా మహేష్ ముందుగా చేద్దామనుకున్న దర్శకుడిని లాస్ట్ మినిట్లో వదులుకుంటున్నాడు.దీనికి రీజన్స్ గా కథ మ్యాటర్లో కన్విన్స్ కాకపోవడమే అని తెలుస్తుంది.

అస్సలు లోపల ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియడం లేదు.సుకుమార్ తో మొదలైన ఈ కన్ఫ్యూజన్ గోల ఇప్పుడు చేద్దామనుకుంటున్న డైరెక్టర్స్ మ్యాటర్లోను వినిపిస్తుంది. సర్కారువారిపాట తర్వాత మహేష్ కశ్చితంగా రాజమౌళితో ఓ సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు.కాని అది లేదని తెలిసిపోయింది.ఇక వంశీపైడిపల్లితో ఆల్మోస్ట్ కన్ఫామ్ అని స్టోరీ కూడా ఓకే అయిపోయినట్లు వార్తలు వచ్చాయి.

కట్ చేస్తే ఇప్పుడు అది కూడా లేదన్నట్లుగా రూమర్స్ వస్తున్నాయి.ఇది చాలదన్నట్లు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇప్పుడు లైన్లోకొచ్చాడు. ఐతే జనవరికి అది కూడా ఎంతవరకు ఉంటుందో తెలియని పరిస్థితి.ఈ గ్యాప్ లో మరో దర్శకుడు వచ్చి ప్రిన్స్ డెసిషన్ ను మార్చినా మార్చవచ్చు.మరి ఈ క్లారిటీ లేని డెసిషన్స్ ను మహేష్ ఇంకా ఎంతకాలం కొనసాగిస్తాడో చూడాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news