కోయంబత్తూరు లో మంగ్లీ… వీడియో వైరల్..!

-

తమిళనాడు లోని కోయంబత్తూరు లో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యం లో అంగరంగ వైభవంగా మహా శివరాత్రి వేడుకలు జరిగాయి. ఇలా అక్కడ జరిగిన కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం లో సెలబ్రెటీస్ పాల్గొనడం విశేషం. అక్కడకి వచ్చిన జనం, భక్తులు ఆకర్షితులయ్యారు.

ఇది ఇలా ఉంటే తెలంగాణ జానపద సింగర్ మంగ్లీ పరమ శివుడి పాటలు పాడి జనం లో మరింత ఉత్సాహం నింపారు. నిజంగా అక్కడ వున్నవాళ్లు అంత కూడా ఆమె పాటలకి ఫిదా అయి పోయారు అనే చెప్పాలి. అంతే కాదు అప్పటి వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీక్షిస్తున్న జనం, శివ భక్తులు, సద్గురు అభిమానులు ఒక్క సారిగా మంగ్లీ పాటలు పాడటం ప్రారంభించ గానే పైకి లేచి భక్తి పారవశ్యం తో స్టెప్పులు వేసి ఆనందంగా గడిపారు.

అలానే సద్గురు కూడా నటరాజ నృత్యాలు చేస్తూ వారి లో మరింత ఉత్సాహం తీసుకు రావడం జరిగింది. అక్కడ జరిగిన ఈ దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అయి పోయాయి. తెలంగాణ యాస తో ఆట పాటల తో తెలుగు రాష్ట్రాల్లో అభిమానులను సంపాదించున్న మంగ్లీ తాజాగా వచ్చిన సారంగదరియా సాంగ్ తో మరెంత పాపులర్ అయి పోయింది. సంగీత ప్రేక్షకులను మరోసారి ఉత్సహపరిచింది ఈమె. సమంత, రకుల్, మంచు లక్ష్మి కూడా కోయంబత్తూరు విచ్చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news