ట్రోలర్స్‌పై మోహ‌న్ బాబు సీరియ‌స్.. వారికి లీగల్ నోటీసులు

-

గ‌త కొద్ది రోజుల నుంచి హీరో మంచు మేహ‌న్ బాబుపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వ‌స్తున్నాయి. గ‌తంలో ఎక్కువ గా మంచు విష్ణు పై ట్రోల్స్ వ‌చ్చేవి. కానీ ఇటీవ‌ల ట్రోల‌ర్స్ ఏకంగా మోహన్ బాబునే టార్గెట్ చేశారు. కాగ చాలా రోజుల త‌ర్వాత హీరో పాత్ర‌లో మోహ‌న్ బాబు.. స‌న్ ఆఫ్ ఇండియా అనే సినిమా చేశారు. ఈ సినిమా ఇటీవ‌ల విడుద‌ల అయింది. ఈ సినిమా విడుద‌లకు ముందు నుంచే.. తెగ వ్య‌తిరేకిత వ‌చ్చింది. విడుద‌ల అనంత‌రం కూడా హీరో మోహ‌న్ బాబుతో పాటు ఆయ‌న కుటుంబ మొత్తంపై మీమ్స్, ట్రోల్స్ విప‌రీతంగా వ‌చ్చాయి.

ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి మొద‌లు.. సినిమా లోని స‌న్ని వేశాలు, పాటలు ఇలా ప్ర‌తి దానిపై మోహ‌న్ బాబు మీద మీమ్స్, ట్రోల్స్ చేశారు. దీంతో మంచు మోహ‌న్ బాబు సీరియ‌స్ అయ్యారు. ట్రోల్సర్స్ కు ఏకంగా లీగల్ నోటీసులు జారీ చేశారు. అంతే కాకుండా మీమ్, ట్రోల్స్ పేజీల అడ్మీన్ ల‌పై రూ. 10 కోట్ల దావా కూడా వేసిన‌ట్టు తెలుస్తుంది. కాగ ఇటీవ‌ల ట్రోల్స్ పై మోహ‌న్ బాబు స్పందించాడు. త‌న పై కావాల‌నే ఇద్ద‌రు హీరోలు ట్రోల్స్, మీమ్స్ చేయిస్తున్నార‌ని ఆరోపించారు. వీరు త్వ‌ర‌లోనే ఇబ్బందులు ఎదుర్కొంటార‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news