ఏంటో పాపం దేవిశ్రీ టైం ఆసలు బాగోలేదుగా….!!

-

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు దేవి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, ఆ సినిమా విజయం తరువాత మెల్లగా అవకాశాలు అందుకున్నాడు. కెరీర్ పరంగా దేవికి అప్పట్లో వచ్చిన సొంతం, ఆనందం సినిమాలు మంచి హిట్ సాధించి మరింత పేరు తీసుకువచ్చాయి. ఇక అక్కడి నుండి మరింతగా అవకాశాలు అందుకుని దూసుకెళ్లిన దేవి, అక్కడి నుండి పలువురు స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించడం మొదలెట్టాడు. ఇక అదేసమయంలో మెగాస్టార్ హీరోగా వచ్చిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో పాటు ఆ సినిమాకు దేవి అందించిన పాటలకు మరింత గొప్పగా పేరు వచ్చింది.

ఇక ఆపై యువ హీరోలకు సైతం సంగీతం అందించిన దేవి హవా మరింతగా ఊపందుకుంది. ఒకానొక సమయంలో చిన్న పెద్ద అనే తేడాలేకుండా అవకాశాలతో దూసుకెళ్లిన దేవి, ఇటీవల మాత్రం కొత్త వెనుకబడ్డాడు అని అంటున్నారు సినీ విశ్లేషకులు. దానికి కారణం ఎప్పటికప్పుడు యువ సంగీత దర్శకుల రాకతో పాటు ఇటీవల తనకు మంచి పోటీ ఇచ్చే థమన్, ఇంకా బాగా దూసుకెళ్లడం అని తెలుస్తోంది. ఇటీవల మహేష్ బాబుకు భరత్ అనే నేను సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చిన దేవి, ఆపై ఆయన హీరోగా వచ్చిన మహర్షి,

 

సరిలేరు నీకెవ్వరు సినిమాలకు మాత్రం ఆ రేంజ్ మ్యూజిక్ ఇవ్వలేదనే విమర్శలు ఆయనపై మొదలయ్యాయి. దానితో పాటు కొద్దిరోజుల క్రితం అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అలవైకుంఠపురములో సినిమాకు థమన్ ఇచ్చిన సాంగ్స్ కు నేషనల్ లెవెల్ లో గుర్తింపు రావడం దేవికి కొద్దిపాటి అవకాశాలు తగ్గేలా చేసిందని అంటున్నారు. ఇక ప్రస్తుతం ఉప్పెన, బన్నీ సుకుమార్ ల సినిమాలు మాత్రమే దేవి చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో అయినా దేవి మళ్ళి ఎంతవరకు పుంజుకుంటాడో చూడాలి….!!

Read more RELATED
Recommended to you

Latest news