జబర్దస్త్ కు గుడ్ బై చెప్పబోతున్న నాగబాబు, రోజా..!

-

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈటివిలో ప్రసారమవుతున్న ఈ షోకి క్రేజీ ఫాలోవర్స్ ఉన్నారు. ఐదేళ్లుగా 300 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్న ఈ కామెడీ షోకి కంటెస్టంట్స్ మారుతున్నా జడ్జులుగా నాగబాబు, రోజా మాత్రమే ఉన్నారు. జబర్దస్త్ కమెడియన్స్ తో పాటుగా వీళ్లు కూడా ఈ షో వల్ల భారీగానే సంపాదించారని తెలుస్తుంది.

ఇదిలాఉంటే 2019 ఏపి ఎన్నికల్లో జబర్దస్త్ ఇద్దరు జడ్జులు పోటీ చేస్తున్నారు. జనసేన అభ్యర్ధిగా నాగబాబు నర్సాపురం నుండి లోక్ సభకు పోటీ చేస్తుండగా.. నగరి నుండి వైసిపి అభ్యర్ధిగా రోజా కంటెస్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరు ఇప్పుడు పాలిటిక్స్ లో బిజీ అవుతుండటం వల్ల జబర్దస్త్ నుండి బయటకు వస్తున్నారని తెలుస్తుంది.



జబర్దస్త్ షోకి వీళ్ల కామెంట్స్ కూడా బాగా ప్లస్ అని చెప్పొచ్చు. మరి నాగబాబు, రోజా లేకుండా జబర్దస్త్ ఎలా ఉంటుందో చూడాలి. వారి ప్లేస్ లో మీనాతో పాటుగా మరొక మేల్ ఆర్టిస్ట్ ను పెడతారని టాక్.

Read more RELATED
Recommended to you

Latest news