ఎన్.టి.ఆర్ ను చూసి నేర్చుకోమన్న నాగ్..!

-

అక్కినేని అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా మిస్టర్ మజ్ ను. బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కొద్ది గంటల క్రితం హైదరాబాద్ జె.ఆర్.సి కన్వెన్షన్ లో జరిగింది. ఈ సందర్భంగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అటెండ్ అవడం విశేషం.

వేడుకలో నాగ్ మాట్లాడుతూ మా పెద్ద అబ్బాయ్.. మా పెద్ద పెద్దబ్బాయ్ అంటూ ఎన్.టి.ఆర్ ను సంభోదించాడు. అంతేకాదు ఎన్.టి.ఆర్ ను చూసి యాక్టింగ్.. మాస్ రెండిటిని నేర్చుకోమని అఖిల్ కు సలహా ఇచ్చాడు నాగార్జున. తనయుడి కెరియర్ ను సెట్ చేసే దాకా నిద్రపట్టని విధంగా ఉన్న నాగార్జున అఖిల్, హలో సినిమాల కన్నా మిస్టర్ మజ్ ను సినిమా విషయంలో కాస్త రిలాక్స్ గానే కనిపిస్తున్నారు. సినిమాలో కొన్ని సీన్స్ చూశా చాలా బాగున్నాయి. లవ్ స్టోరీస్ ఎలా తీయాలో దర్శకుడు వెంకీకి తెలుసు కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు నాగార్జున.

Read more RELATED
Recommended to you

Latest news