2.ఓ టీజర్ పై జాతీయ మీడియా అక్కసు

-

శంకర్, రజిని కాంబినేషన్ లో వస్తున్న ప్రెస్టిజియస్ మూవీ 2.ఓ. రోబోకి సీక్వల్ గా వస్తున్న ఈ సినిమా టీజర్ ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఉదయం 9 గంటలకు టీజర్ రిలీజ్ చేశారు. అయితే టీజర్ సౌత్ మీడియాలో అంతటా సంచలనం సృష్టిస్తుండగా 2.ఓ టీజర్ మీద నేషనల్ మీడియా అంత దృష్టి పెట్టినట్టు కనిపించడం లేదు. అంతేకాదు తెలుగు, తమిళ భాషల్లో ఈ టీజర్ గురించి గొప్పగా చెబుతుండగా నేషనల్ మీడియా మాత్రం టీజర్ సోసోగానే ఉందన్నట్టుగా చప్పగా ప్రమోట్ చేస్తుంది.

శంకర్, రాజమౌళి సినిమాలు బాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఉంటాయి. అయితే సౌత్ సినిమా అనగానే ముంబై మీడియాకు ఓ చిన్న చూపు ఉంటుంది. సినిమా ప్రమోషన్స్ కు వారు సపోర్ట్ చేయరు. ఇంతకుముందు చాలా సందర్భాల్లో ఈ విషయం అర్ధమవగా లేటెస్ట్ గా 2.ఓ టీజర్ పై నేషనల్ మీడియా చూపిస్తున్న పార్షియాలిటీ పై చర్చలు జరుగుతున్నాయి.

బాలీవుడ్ సినిమా టీజర్ ఏది రిలీజ్ అయినా తెలుగు, తమిళం అనే తేడా లేకుండా ఇక్కడ మీడియా హడావిడి చేస్తుంది. కాని సౌత్ సినిమాల మీద నేషనల్ మీడియా చూపిస్తున్న ఈ పద్ధతి మార్చుకుంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news