అనుమానాలకు తెరలేపుతూ ఆలీ షో కి కొత్త గెస్ట్ లు..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న అలీ గత కొన్ని సంవత్సరాలు నుంచి సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ పాత విషయాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తూ మరింత టిఆర్పి రేటింగ్ తీసుకొస్తున్నారు. ఇలా ఆలీతో సరదాగా కార్యక్రమం పేరిట ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈయన ఎంతోమంది సెలబ్రిటీలను కూడా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేశారు. సాధారణంగా తన కార్యక్రమానికి తీసుకొచ్చే ఇద్దరు సెలబ్రిటీలు ఎవరైనా సరే వారికి చాలా దగ్గర సంబంధం ఉండే విధంగా .. ప్రేక్షకులకు బాగా సుపరిచితులైన వారిని తీసుకొస్తూ ప్రేక్షకులకు సరికొత్త విషయాలను తెలియజేస్తూ ఉండేవారు. కానీ ఈసారి కొత్తగా ఇద్దరు వ్యక్తులను అది కూడా ఒకరితో మరొకరికి సంబంధం లేని వ్యక్తులను తీసుకురావడం ప్రస్తుతం అనుమానాలకు తెరలేపుతోంది.

ఇటీవల కార్తికేయ 2 సినిమాతో మంచి పాపులారిటీ దక్కించుకున్న ప్రముఖ సీనియర్ హీరోయిన్ నటి తులసి అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ స్నేహితుడు ప్రభాస్ శ్రీను ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చి ఎన్నో విషయాలను పంచుకున్నారు..

ఇకపోతే డార్లింగ్ సినిమా ద్వారా మొదటిసారి తులసి , ప్రభాస్ శ్రీను కలయిక ప్రేక్షకులకు పరిచయమయ్యింది . అయితే ఆలీ ఎప్పటినుంచి మీ ప్రయాణం మొదలైంది అని అడగ్గా ప్రభాస్ శ్రీను డార్లింగ్ సినిమా నుంచి మా కలయిక మొదలయింది అని అనడంతో నెటిజన్స్ రకరకాల అర్థాలకు చోటు ఇస్తున్నారు. వీరిద్దరి మధ్య నిజంగా ఏదైనా ఉందా అనే కోణంలో ఆలోచిస్తూ ఉండడం గమనార్హం.

ప్రస్తుతం ప్రభాస్ శ్రీను చేసిన ఈ కామెంట్లు ఎపిసోడ్ ప్రోమోలో వైరల్ గా మారుతున్నాయి . అంతేకాదు తులసి కూడా ఆలీ గురించి ఎన్నో విషయాలను వెల్లడించి మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట బాగా హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news