రామ్ చరణ్ బాటలో మహేశ్ బాబు..SSMB28లో అదే హైలైట్!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రజెంట్ ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ సక్సెస్ ను ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహేశ్ ..నెక్స్ట్ ఫిల్మ్ షూట్ విషయమై మేకర్స్ ప్లాన్ చేస్తు్న్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ మూడో చిత్రం చేయనున్నాడు.

‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీరిరువురి కాంబోలో వస్తున్న SSMB28పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని వార్తలు సోషల్ మీడియాలో వస్తన్నాయి. RC 15లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తు్న్నట్లు తెలుస్తోండగా, అదే బాటలో సూపర్ స్టార్ మహేశ్ నడుస్తున్నాడని అభిమానులు చర్చించుకుంటున్నారు.

వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇందులో హీరోయిన్ గా త్రివిక్రమ్ ఆస్థాన నాయిక టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ పిక్చర్ లో భారీ యాక్షన్ సీన్స్ ను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు.

పూజా హెగ్డే
పూజా హెగ్డే

జూనియర్ ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ మాదిరిగా..ఇందులోనూ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఓ భారీ ఫైట్ ను కొరియోగ్రాఫ్ చేస్తున్నట్లు సమాచారం. సినిమాకు ఈ భారీ ఫైట్ సీన్ హైలైట్ అయ్యే విధంగా మాటల మాంత్రికుడు ఫోకస్ పెడుతున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. ఎస్.ఎస్.థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్.

 

Read more RELATED
Recommended to you

Latest news