పదకొండు మంది హీరోలతో మెగా డాటర్ మూవీ..!

-

ప్రస్తుతం నిహారిక వరుస సినిమాల మీద ఫోకస్ చేస్తోంది. అలానే ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పేరుతో సొంతంగా ఒక బ్యానర్ ని నెలకొల్పింది నిహారిక. ఇప్పటివరకు వెబ్ సిరీస్ లు షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే చేసింది ఫస్ట్ టైం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథ తో ఒక సినిమా ని తెర మీదకు తీసుకు వస్తోంది. యూత్ ఫుల్ ఎక్కుతున్న ఈ సినిమాకి కమిటీ కుర్రాళ్ళు అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

యాదవ్ వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మొత్తం 11 మంది హీరోలు నలుగురు హీరోయిన్లు ఉంటున్నారు. అలానే వాట్ ది ఫిష్ పేరుతో దాదాపు ఐదేళ్ల తర్వాత టాలీవుడ్లోకి మళ్ళీ వస్తోంది నిహారిక. ఈ సినిమాకి వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో అష్టలక్ష్మి అనే అమ్మాయిగా నిహారిక కనపడబోతోంది తెలుగుతో పాటుగా తమిళంలో కూడా ఒక సినిమా చేయడానికి నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Latest news