అరవింద సమేత ట్రైలర్.. సీమ పౌరుషం చూపించినాడబ్బా..!

-

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా దసరా బరిలో దిగుతుంది. ఈ సినిమా రిలీజ్ ను పురస్కరించుకుని ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. కొద్దినిమిషాల క్రితం ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగిసింది. ఇక ఈ సందర్భంగా అరవింద సమేత ట్రైలర్ రిలీజ్ చేశారు. నందమూరి కళ్యాణ్ రాం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఓ పక్క సీమ నెత్తుటి పౌరుషం చూపిస్తూనే మరో పక్క అసలు గొడవలు రాకుండా ఆపేవాడు మగాడు అంటూ హీరోయిన్ తో చెప్పించారు. 99 అడుగులు నీళ్ల కోసం తవ్వి 100 అడుగులో నీళ్లు పడతాయని తెలిసి వదిలేస్తే దాన్ని ఏమంటారంటూ ఆ వేసే ఒక్క అడుగు 100 అడుగులతో సమానం అంటూ ఎన్.టి.ఆర్ చెప్పే డైలాగ్.

టోటల్ గా అరవింద సమేత ట్రైలర్.. త్రివిక్రం మార్క్ డైలాగ్స్ తో పాటుగా.. ఎన్.టి.ఆర్ రేంజ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తుందని చెప్పొచ్చు. అక్టోబర్ 11న వెండితెర మీద తన వీర రసం చూపించబోతున్న ఎన్.టి.ఆర్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news