మహానాయకుడు వారికి హ్యాండ్ ఇచ్చాడు..!

-

ఎన్.టి.ఆర్ బయోపిక్ లో మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడు జనవరి 9న రిలీజైంది. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అందుకే మహానాయకుడు రిలీజ్ విషయంలో కాస్త ఆలోచనలో పడ్డారు దర్శక నిర్మాతలు. ఫైనల్ గా ఎన్.టి.ఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22న రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమాకు భారీగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కు మహానాయకుడు ఫ్రీగా ఇచ్చేస్తున్నారని వార్తలు వచ్చాయి.

మీడియాలో వచ్చిన ఈ వార్తలను అందరు నిజమే అనుకున్నారు కాని అలా ఫ్రీగా ఏం ఇచ్చేయడం లేదట. కథానాయకుడు కొన్న వాల్యూకి 25 శాతం రిటర్న్ ఇచ్చి మహానాయకుడు కొత్త బిజినెస్ చేయాలని చెప్పారట. అయితే కథానాకుడు ఎఫెక్ట్ తో సెకండ్ పార్ట్ కు ఓపెనింగ్ కష్టమని భావించి డిస్ట్రిబ్యూటర్స్ సాహ్సం చేయట్లేదట. అందుకే సురేష్ బాబు, ఎన్వి ప్రసాద్ లతో మాట్లాడి వారి ద్వారా ఫిబ్రవరి 22న ఎన్.టి.ఆర్ మహానాయకుడు రిలీజ్ ప్లాన్ చేశారట. మరి ఈ మహానాయకుడు అయినా ప్రేక్షకుల మనసులు గెలుస్తాడా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news