మరోసారి నందమూరి బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు

-

నందమూరి బాలకృష్ణ ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన వీర సింహారెడ్డి విజయోత్సవ సభలో ” అక్కినేని తొక్కినేని” అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. దీనిపై అక్కినేని అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ దిష్టిబొమ్మలు కూడా దగ్ధం చేశారు. అయితే నేడు హిందూపురం పర్యటనలో ఉన్న బాలకృష్ణ ని ఇటీవల అక్కినేని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని బాలయ్యని కోరారు.

ఈ వివాదానికి తరలించే క్రమంలో బాలయ్య మరో కొత్త వివాదాన్ని సృష్టించారు. ” నాగేశ్వరరావుకు నేనంటే చాలా ఇష్టం. తన పిల్లల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించేవారు. ఆప్యాయంగా పలకరించేవారు. ఎందుకంటే ఆప్యాయత అక్కడ ( అక్కినేని కుటుంబం)లో లేదు. ఇక్కడ ఉంది. గుర్తుపెట్టుకోండి” అంటూ వెటకారంగా నవ్వారు. దీంతో నాగార్జునని ఉద్దేశించే బాలకృష్ణ ఈ విధంగా మాట్లాడారని అక్కినేని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news