మహిళలకు మాత్రమే.. రైటర్ పద్మభూషణ్ ఉచిత షోలు..!!

-

మొదట కమెడియన్గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుహాస్.. హీరోగా నటించిన చిత్రం కలర్ ఫోటో ఈ సినిమా ఓటీటి లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాలలో విలన్ గా కమెడియన్ గా కూడా నటించారు. తాజాగా హీరో గా రైటర్ పద్మభూషణ్ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా పాజిటివ్ రివ్యూ లతోపాటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో విడుదలైన రెండు మూడు రోజుల లోపే ఈ సినిమా లాభాల బాట పట్టింది.

ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమా మరింత భారీ వసూలు నమోదు చేయడం కోసం విభిన్నమైన ప్రమోషన్లను చిత్ర బృందం చేస్తున్నారు. రేపు తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన 38 థియేటర్లలో మహిళలకు పూర్తిగా రైటర్ పద్మభూషణ్ సినిమా ఉచితంగా ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. ఎంత మంది మహిళలు ఈ షోకు హాజరు అయిన కూడా ఉచితంగానే టికెట్లు ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని యాంకర్ సుమ అధికారికంగా ప్రకటించడం జరిగింది. కేవలం మహిళల కోసమే రైటర్ పద్మభూషణ్ సినిమాలు ఉచితంగా ప్రదర్శించబోతున్నట్లు సుమ సోషల్ మీడియా ద్వారా తెలియజేసి అందరికీ ఆచార్యాన్ని కలిగించింది.

ఇది కూడా సినిమా ప్రమోషన్లలో ఒక భాగమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించారు. చాయ్ బిస్కెట్ సంస్థతో లహరి ఫిలిమ్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఎంతటి కలెక్షన్లు రాబడుతుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news