త్రివిక్రమ్ తో గొడవ నేటికీ తేలలేదు అంటున్న పవన్ కళ్యాణ్..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా బాలయ్య హోస్ట్గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి హాజరయ్యారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయనుండగా .. నిన్న రాత్రి 9 గంటలకు ఆహా లో స్ట్రీమింగ్ చేశారు.. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ సినీ రాజకీయ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలను అడిగారు. అందులో భాగంగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఉన్న బాండింగ్ గురించి విభేదాల గురించి కూడా చెప్పమని అడిగారు బాలయ్య.

నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చాక త్రివిక్రమ్ శ్రీనివాస్ కి , పవన్ కి మధ్య ఆన్ స్క్రీన్ బాండింగ్ అనేది కనిపించడం లేదు. జనసేన పార్టీ ఆవిర్భావ సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కి పరోక్షంగా ప్రత్యక్షంగా స్పీచ్ల విషయంలో సహాయం చేశారు. పవన్ వ్యక్తిత్వం గురించి కొన్ని సందర్భాలలో కొనియాడారు కూడా. అయితే పవన్ రాజకీయాల్లోకి ఎప్పుడైతే వెళ్లిపోయారో అప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి పవన్ దూరమయ్యారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కి ప్రత్యక్షంగా త్రివిక్రమ్ మద్దతు పలుకుతారేమో అని అభిమానులు అనుకున్నారు. కానీ త్రివిక్రమ్ మాత్రం తన సినిమాలతో బిజీ అయిపోయారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాలు సినిమాలు చేసుకుంటూ ఉన్నారు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందేమో అన్న సందేహం కూడా వస్తుంది. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ శ్రీనివాస్ తో గొడవ ఈరోజుకి ఉందని.. ఇప్పటికీ తేలలేదని తెలిపారు పవన్ కళ్యాణ్. త్రివిక్రమ్ గురించి పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news