టాలీవుడ్ లో న‌న్ను వాడుకుని మోసం చేశారు – హీరోయిన్ పాయల్

-

టాలీవుడ్ లో న‌న్ను వాడుకుని మోసం చేశారంటూ హాట్‌ కామెంట్స్‌ చేసింది హీరోయిన్ పాయల్. ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా కుర్ర కారు హృదయాలను తన వైపు తిప్పుకున్న పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత ఆమె అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే రాలేదు కానీ నిత్యం సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్లతో నిత్యం ట్రెండింగ్ లో ఉంటుంది. ఇది ఇలా ఉండగా, RX100 లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత హైదరాబాదులో ఒంటరిగా ఉన్నప్పుడు కొందరు డైరెక్టర్లు తనను మిస్ గైడ్ చేశారని హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ వెల్లడించారు. సింపుల్ గా చెప్పాలంటే తనను వాడుకున్నారని తెలిపారు. ‘మంగళవారం’ మూవీ ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ… కొన్ని సినిమాల విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది. తదుపరి సినిమాల కోసం బుర్ర వాడుతున్నానని పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news