ఆరెక్స్ 100 హీరోయిన్ కు ఎంత కష్టం వచ్చింది

-

ఆరెక్స్ 100 సినిమాతో టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారిన పాయల్ రాజ్ పుత్ తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటుంది. బాలీవుడ్ సీరియల్స్ లో నటించిన ఈ అమ్మడు ఆరెక్స్ 100 సినిమాతో లైం లైట్ లోకి వచ్చింది. అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కార్తికేయ హీరోగా నటించాడు. కార్తికేయ, పాయల్ రొమాన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచింది.

ఒక్క సినిమాతోనే పాయల్ తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకోగా ఇప్పుడు ఆమెకు వచ్చిన కష్టం ఆమె ఫ్యాన్స్ ను బాధపడేలా చేస్తుంది. ఇంతకీ పాయల్ కు ఏం కష్టం వచ్చింది అంటే.. పాయల్ సోదరుడు ధ్రువ్ రాజ్ పుత్ రెండేళ్ల క్రితం నుండి కనిపించడం లేదట. 2016, మార్చి 27 నుండి కనిపించలేదట. ముంబై అంధేరి వెస్ట్ లో లోఖండ్ వాలా లో చివరగా కనిపించాడని.. సోదరుడు కనిపించలేదు.. అతన్ని చూసి మూడేళ్లు కావొస్తుందని మెసేజ్ పెట్టింది పాయల్.

తన పుట్టినరోజున అతన్ని గుర్తుతెచ్చుకుని పాయల్ హ్యాపీ బర్త్ డే భాయ్.. నువ్వు ఈ మెసేజ్ చూడాలని అనుకుంటున్నా.. నువ్వు ఇబ్బందులు పడుతుంటే మాకు ఫోన్ చెయ్యి.. మీ కోసం మేము ఎంతగానో ఎదురుచూస్తున్నాం అంటూ మెసేజ్ పెట్టింది. హ్యాష్ ట్యాగ్ ఫైండ్ ధ్రువ్ అంటూ తన మెసేజ్ పోస్ట్ చేసింది పాయల్ రాజ్ పుత్.

Read more RELATED
Recommended to you

Latest news