ప్రభాస్ మెగాస్టార్ ని మించిపోయాడట ..!

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి ఫ్రాంఛైజీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో ఏ నిర్మాత సినిమాని ప్లాన్ చేసినా భారీ బడ్జెట్ తోనే ప్లాన్ చేస్తున్నారు. అంటే కనీసం 250 కోట్లకి పైగానే. సాహో కూడా ఇలా భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమానే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. ఒక్క బాలీవుడ్ లో తప్ప మిగిలిన అన్ని భాషల్లో ఆశించినంతగా సక్సస్ కాలేదు. అయినా ప్రభాస్ క్రేజ్ మాత్రం స్టాండర్డ్ గానే ఉంది.

 

ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ప్రభాస్ నెక్స్ట్ సినిమా కూడా లైన్ లో పెట్టాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ లో ఈ సినిమా దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో రూపొందబోతుంది. మహానటి ఫేం నాగ్ అశ్విన్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణే హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయని తెలుస్తుంది.

 

ఇక ప్రభాస్ తాజాగా రష్యాకు చెందిన ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డును సొంతం చేసుకున్నాడు. ఆ అవార్డు 30 ఏళ్ల క్రితం ఆ తరం స్టార్ హీరో రాజ్ కపూర్ సాధించారు. మళ్లీ ఇంతకాలానికి బాహుబలి సినిమాతో రష్యా ప్రేక్షకులను అలరించిన ప్రభాస్ ఈ అవార్డు దక్కించుకోవడం గొప్ప విషయం. అయితే టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీ తో పాటు మిగతా స్టార్ హీరోలు ఎన్నో అద్భుతమైన సినిమాలు ఎన్నో ప్రయోగాలు చేసినప్పటికి ఆ అవార్డ్ ను సాధించలేకపోయారు. దాంతో ఇప్పుడు ప్రభాస్ అందరి దృష్ఠిలో గ్రేట్ అనిపించుకుంటున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news