క్వారంటైన్ లో భర్త.. ప్రియుడితో భార్య..!

-

కరోనా నేపధ్యంలో దేశంలో చాలా విచిత్రమైన సంఘటను చోటుచేసుకుంటున్నాయి. నానా తంటాలు పడి క్వారంటైన్ లో సమయాన్ని గడిపి, చివరికి భార్య వద్దకు చేరుకున్న ఆ భర్తకు గట్టి షాక్ తగిలింది. బీహార్ లోని బెగూసరాయ్ లో గల షకర్పురాలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే…

ఏడాది క్రితం బెగూసరాయ్ కి చెందిన యువతికి, ఖాగారియా జిల్లాకు చెందిన యువకునికి వివాహం జరిగింది. వివాహం అనంతరం 9 నెలల తర్వాత భార్యను పుట్టింటిలో దిగబెట్టి…. పని కోసం గుజరాత్ కు వెళ్లాడు ఆ భర్త. భర్త లేకపోవడంతో ఆ భార్య అక్కడ తన పాత ప్రియుడిని కలుసుకుంది. ఇంతలోనే పని పూర్తి చేసుకున్న భర్త గుజరాత్ నుంచి తిరిగొచ్చాడు. కానీ, లాక్ డౌన్ నిబంధనలతో ఆ భర్త 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సి వచ్చింది. క్వారంటైన్ ను ముగించుకుని అత్తారింటకి వచ్చిన ఆయనకు ఓ విషయం తెలిసింది. ప్రియుడితో కలసి వెళ్లిపోయేందుకు భార్య ప్లాన్ వేసిందనే విషయాన్ని తెలుసుకున్న అతను… ఈ విషయాన్ని పోలీసుకులకు తెలియజేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రియుడితో పాటు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ తర్వాత ఆమెకు నచ్చజెప్పి భర్తతో పాటు పంపించారు.

Read more RELATED
Recommended to you

Latest news