2020 ఎండింగ్ లో రానున్న ప్రభాస్ ..!

-

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసందే. ఈ సినిమా దాదాపు షూటింగ్ విదేశాలలో జరుపుకుంది. అయితే కరోనా వ్యాపించిన నేపథ్యంలో అర్ధాంతరంగా షూటింగ్ ని నిలిపివేసి ఇండియాకి తిరిగి వచ్చేశారు. వచ్చిన దగ్గర్నుండి లాక్ డౌన్ కారణంగా మళ్ళీ షూటింగ్ జరగలేదు. అయితే ఈ సినిమాకోసం భారీ సెట్ ని మాత్రం సిద్దం చేసి ఉంచారు.

 

లాక్ డౌన్ ఎత్తేయగానే పరిస్థితులను బట్టి లిమిటెడ్ టెక్నీషియన్స్ తో షూటింగ్ ని కంప్లీట్ చేస్తారట. అంతేకాదు మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటూ వచ్చేలా చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా పూజా హెగ్డే జటిస్తోంది. పీరియాడికల్ బ్యాగ్డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని ముందు నుంచి అంటున్నారు.

 

రాధే శ్యాం అన్న టైటిల్ ప్రస్తుతం ప్రచారం లో ఉంది. ఒక బ్యూటి ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని దీపావళి సందర్భంగా నవంబర్ రెండవ వారంలో రిలీజ్ అనుకుంటున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాని నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే మ్యూజిక్ టీచర్ గా కనిపిస్తుందని సమాచారం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ .. నాగ్ అశ్విన్ తెరకెక్కించే సినిమాలో నటిస్తాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 50 వ సినిమాగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news