ఆ స్టార్ హీరోతో సైరా డైరెక్ట‌ర్ ఫిక్స్‌…!

-

సైరా నరసింహారెడ్డితో దర్శకుడిగా తన పటిమను చాటుకున్నాడు సురేందర్ రెడ్డి. ఓ తొలి తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడి క‌థ‌ను సురేంద‌ర్‌రెడ్డి ఈ రేంజ్ టేకింగ్‌లో చెపుతాడ‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. అస‌లు ఆ జాన‌ర్ సురేంద‌ర్‌రెడ్డికి అస్స‌లు ట‌చ్ లేదు కాని ఇంత అందంగా ఆ సినిమా క‌థ చెపుతాడ‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉయ్యాలవాడ కథ గురించి పుస్తకాల రూపంలో పలు బయోగ్రఫీలు ఉన్నాయి. మూలాలను మిస్ కాకుండానే, వాస్తవానికి అతీతంగా కాకుండానే..ఉయ్యాలవాడ కథను సురేందర్ రెడ్డి రసవత్తరంగా చెప్పారు.

ఇక చ‌రిత్ర‌ను చాలా వ‌ర‌కు చరిత్ర‌లా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తూనే సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా విజ‌యం సాధించేందుకు త‌న వంతుగా క‌ష్ట‌ప‌డ్డాడు. రు.250 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో సినిమా తెర‌కెక్కించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఈ సినిమాను సురేంద‌ర్ డీల్ చేసిన విధానానికి చాలా మంది ఫిదా అవుతున్నారు. ఇక ఇప్పుడు సురేందర్ రెడ్డి వాట్ నెక్ట్స్ అంటే.. ప్రభాస్ పేరు వినిపిస్తోంది.

సాహో త‌ర్వాత ప్ర‌భాస్ ప్ర‌స్తుతం జిల్ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా కూడా దాదాపు రు.150 కోట్ల భారీ బ‌డ్జెట్తో తెర‌కెక్కుతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌చ్చే యేడాది ద్వితియార్థంలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండ‌గానే ఇప్పుడు సురేందర్ రెడ్డి- ప్రభాస్ కాంబోలో ఒక సినిమా రూపొందుతోందని ప్రచారం మొదలైంది. సైరా, సాహో వంటి భారీ సినిమాలకు పని చేసిన దర్శకుడు, హీరో కాంబినేషన్లోని సినిమా వ‌స్తే మామూలుగా ఉండ‌దు క‌దా..!

Read more RELATED
Recommended to you

Latest news